ఎగ్జిట్ పోల్స్‌పై ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం

by Disha Web Desk 2 |
ఎగ్జిట్ పోల్స్‌పై ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు సీఈసీ పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. ఈ విడతలో మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు.. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఇందుకోసం మొత్తం 18 లక్షల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికల జరుగనున్నాయి. ఇదిలా ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

ఈనెల 19 నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. 2024 జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకూ ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించుకోవచ్చని ఈసీ తెలిపింది. అయితే, తొలి దశ ఎన్నికలపైనే ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. మొదటి విడతలో ఆధిక్యం చూపితే అది మిగతా దశల్లో కూడా ఆ ఆధిక్యం కొనసాగుతుందని పార్టీలు ఆశిస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ, దాని మిత్రపక్షాలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి సభ్యులు కూడా భావిస్తున్నారు.

Next Story

Most Viewed