దేశ ప్రథమ పౌరులు ముస్లింలా?.. వారికి మా ఆస్తులు పంచుతారా?

by Disha Web Desk 2 |
దేశ ప్రథమ పౌరులు ముస్లింలా?.. వారికి మా ఆస్తులు పంచుతారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ ప్రథమ పౌరులు ముస్లింలని కాంగ్రెస్ నేత ఒకరు అంటున్నారని, వారికి ప్రజల ఆస్తులను పంచి పెడతానని కాంగ్రెస్‌లో గడ్డం పెంచుకున్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పోలింగ్‌కు ముందే మోడీ ప్రధాని అని తేలిపోయిందని, చేవెళ్ల ప్రజలు మోడీకి ఓటేస్తామని అంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఇప్పటికే చిప్ప ఉందని, కరెంట్‌కు, ఆర్టీసీకి, ఇతర అభివృద్ధి పనులకు డబ్బులు కావాలన్నా సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన పెద్దన్న మోడీ వద్దకు వెళ్లాల్సిందేనని అన్నారు. మోడీ అప్పులు ఇప్పించడం వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందుకి వెళ్తోందన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed