నిజాంసాగర్‌లో యువతి అదృశ్యం

by Aamani |
నిజాంసాగర్‌లో యువతి అదృశ్యం
X

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామానికి చెందిన కడారి సవిత(20)అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్సై కే.సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బంజపల్లి గ్రామానికి చెందిన కడారి సవిత ఈ నెల 18వ తేది రోజున మెదక్ గ్రామానికి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు. తల్లి కడారి సాయవ్వ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తె 18వ తేదీన ఇంటి నుండి వెళ్లిందని తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వారి ఇళ్ళతో పాటు తమ బంధువుల ఇళ్లలో వెతికిన ఆమె ఆచూకీ లభించలేదని ఫిర్యాదులో యువతి తల్లి కడారి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కడారి సవిత సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story