వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి

by Sridhar Babu |
వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృతి
X

దిశ, దమ్మపేట : మండలంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ వీధికి చెందిన తిరుమల మహాలక్ష్మణుడు (55) తన ద్విచక్ర వాహనంపై గురవాయిగూడెం గ్రామంలో కూలి పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో గురవాయిగూడెం గ్రామ శివారులో తన ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు హుటాహుటిన దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా అప్పటికే క్షతగాత్రుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.

అదే విధంగా మండలంలోని గురవాయిగూడెం గ్రామ శివారులో ఉన్న స్పీడ్ బ్రేకర్లు వద్ద రైల్వే ట్రాక్ నిర్మించే కడ్డీలతో చత్తీస్గడ్ నుంచి వైజాగ్ వెళ్తున్న లారీ గురవాయిగుడెం స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్ నిర్మించే కడ్డీలు లారీ క్యాబిన్ కు ముందుకు వచ్చేసి డ్రైవర్ కు తగలడంతో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీపై ఉన్న రైల్వే ట్రాక్ కడ్డీలు మొత్తం డ్రైవర్ మీద పడి మధ్యప్రదేశ్ కు చెందిన డ్రైవర్ కాక సింగ్ (36) అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రైల్వే ట్రాక్ కడ్డీలు మొత్తం ప్రధాన రహదారిపై పడడంతో పోలీసులు నాలుగు జేసీబీల సహాయంతో రైల్వే ట్రాక్ కడ్డీలను పక్కకు నెట్టించారు. రెండు ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed