ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

by Sridhar Babu |
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ,శంకర్పల్లి : గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. శంకర్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెహిదీపట్నం నుంచి శంకరపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు బుల్కాపూర్ వద్ద గల చాముండేశ్వరి గ్రానైట్ దుకాణం వద్ద గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీ కొట్టింది.

అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని, అతని పేరు, వివరాలు తెలియదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న శంకరపల్లి క్రైమ్ ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed