- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
దిశ, కార్వాన్ : జల్సాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాలను వృత్తిగా చేసుకున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సందర్భంగా సుల్తాన్ బజార్ డివిజన్ ఏసీపీ శంకర్, ఇన్ స్పెక్టర్ శ్రీనివాసచారి, డీఎస్ ఐ.నరేష్ లతో కలిసి మంగళవారం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించారు. యాకత్ ఫుర ప్రాంతానికి చెందిన ఇబ్రహీం షేక్ రసూల్ ఖాన్, అబ్దుల్ అర్వాజ్ లు చిన్ననాటి స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరు సులభంగా డబ్బును సంపాదించాలనే క్రమంలో మొబైల్ ఫోన్ దొంగతనాలు, రాబరీ చేస్తూ జీవనం గడుపుతున్నారు. కాగా ఈనెల 15వ తేదీన వీరు చాదర్ఘట్ లోని రోజ్ బేకరీ ప్రాంతంలో
ఓ క్యాబ్ డ్రైవర్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్, వాలెట్ను దొంగలించి అక్కడి నుంచి పరారయ్యారు. అదే రోజు కోఠి స్టేట్ బ్యాంక్ లోని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఫుట్పాత్ పక్కన ఓలా క్యాబ్ డ్రైవర్ ఫొన్ మాట్లాడుతుండగా ఇబ్రహీం షేక్ రసూల్ ఖాన్ డ్రైవర్ చేతిలోని ఫోను లాక్కొని పరారయ్యాడు. క్యాబ్ డ్రైవర్ మీర్జాపురి సన్నత్ సైమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన క్రైమ్ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజీలు, వివిధ కోణాలలో పరిశీలించిన అనంతరం విశ్వసనీయ సమాచారం మేరకు మొబైల్ స్నాచింగ్ కు పాల్పడిన ఇబ్రహీం షేక్ రసూల్ ఖాన్, అబ్దుల్ అర్వాజుల్ ను మంగళవారం
ఉదయం గుజరాత్ గల్లీలో చోరీ చేసిన మొబైల్ ను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా క్రైమ్ పోలీసులు వారిని పట్టుకొని విచారించారు. కోఠి పరిధిలో జరిగిన చోరీ కాకుండా చాదర్ ఘాట్ లో జరిగిన మొబైల్ చోరీలను గుర్తించారు. ఇద్దరి నిందితుల వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లను, ఒక వ్యాలెట్, ఒక టీవీఎస్ రైడర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఇద్దరు నిందితులు పాత నేరస్తులు. గతంలో వీరిపై అబిడ్స్, ఫలక్ నుమ, రైన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.