కామారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

by Aamani |
కామారెడ్డి జిల్లాలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి
X

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.వ్యవసాయ బావి దగ్గర విద్యుత్‌ షాక్‌ కు గురైన ఓ యువ రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం రాజంపేట మండలం లో అన్నారం తండా లో చోటుచేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం..అన్నారం తండాకు చెందిన భాను తిరుపతి (33) వ్యవసాయ బావి దగ్గర పని చేస్తున్న క్రమంలో మృతుడి వ్యవసాయ పొలం నుంచి కరెంటు సప్లై కొరకు తీసుకున్న విద్యుత్ వైర్ ప్రమాదవశాత్తు తగలడంతో తిరుపతి అక్కడికక్కడే మరణించాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.తిరుపతి మృతి తో అన్నారం తండా లో విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed