తాళాలు వేసిన ఐదు ఇళ్లలో చోరీ

by Aamani |
తాళాలు వేసిన ఐదు ఇళ్లలో చోరీ
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీ, వివేకానంద కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీల్లో గురువారం రాత్రి తాళాలు వేసి ఉన్న ఐదు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దొంగల ఆచూకీ కోసం పోలీస్, సీసీఎస్, స్పెషల్ పోలీసులను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలి

కాలనీల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదా 100 నంబర్ కి డయల్ చేసి చెప్పాలని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఎవరైనా దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు గాని, ఇల్లుకు తాళం వేసి బయటకు వెళ్లే సందర్భాల్లో గాని, మీ విలువైన వస్తువులను, ఆభరణాలను, నగదును వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే ఇంటికి వేసిన తాళాలు బయటకు కనిపించే విధంగా కాకుండా, కనబడకుండా ఉండేటట్లుగా వేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story