తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

by Aamani |
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
X

దిశ, జిన్నారం: జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితులు, జిన్నారం ఎస్ ఐ నాగలక్ష్మి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్ల గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఉంది. దీన్ని గమనించిన నలుగురు వ్యక్తులు తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి చొరబడ్డారు. ఇంట్లో గల బీరువాలో ఉన్న నాలుగు తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించుకుపోయారు. రూ. 20 వేల వరకు నగదు పోయిందని బాధితులు తెలిపారు. విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

Advertisement

Next Story