పురుగుల మందు తాగి మహిళ మృతి

by Aamani |
పురుగుల మందు తాగి మహిళ మృతి
X

దిశ,తాడ్వాయి: కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిర్మాకుంఠ తండా కు చెందిన మేగవత్ శాంతి (32) కాళ్ళ కడియాలు పెద్దగా ఉన్నాయని వాటిని చిన్నగా చేయించడానికి భర్తతో తెలుపగ,తర్వాత చేయిస్తానని మందలించి ఊరులోకి వెళ్ళగానే మనస్థాపానికి గురైన మహిళా పురుగుల మందు తాగి పడిపోయినట్లు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతురాలికి ఒక కుమారుడు కలడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed