తెలంగాణలో 983 కొత్త కేసులు.. 11 మంది మృతి

by  |
తెలంగాణలో 983 కొత్త కేసులు.. 11 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 983 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 67,660 కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి 551 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 48,609 మంది బాధితుల్లో రికవరీ అయ్యారు. 18,500 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 4,87,238 కరోనా టెస్టులు నిర్వహించారు.


Next Story

Most Viewed