దేశంలో కరోనా కల్లోలం… కొత్తగా 92,605 కేసులు

by  |
దేశంలో కరోనా కల్లోలం… కొత్తగా 92,605 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 92,605 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 1,133 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 54,00,620కి చేరింది. మృతుల సంఖ్య 86,752కు చేరింది. మహమ్మారి బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 10,10,824 కు చేరింది. వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 43,03,043కు చేరింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28గా ఉంది.


Next Story

Most Viewed