ప్రకృతి ప్రకోపం.. నేపాల్‌లో 10మంది మృతి

by  |
ప్రకృతి ప్రకోపం.. నేపాల్‌లో 10మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ :

మన పొరుగు దేశం నేపాల్‌‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సియాంగ్జా జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 9మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.

వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సియాంగ్జా జిల్లా ప్రధాన అధికారి గంగా బహదూర్ చెత్రి వెల్లడించారు. ఇందులో 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవిగా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు బహదూర్ చెత్రి తెలిపారు.


Next Story

Most Viewed