మరో 879 కేసులు, 3 మరణాలు

by vinod kumar |
మరో 879 కేసులు, 3 మరణాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రోజురోజుకీ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కొత్తగా 879 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,553కు చేరింది. నేడు మరో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 220కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 4,224 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 5,109 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 652, మేడ్చల్ 112, రంగారెడ్డి 64, జనగాం 7, సంగారెడ్డి 2, వరంగల్ రూరల్ 14, మంచిర్యాల 2, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్ 9, మహబూబాబాద్ 2, మెదక్ 1, నాగర్ కర్నూల్ జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story