పథకాల్లో 85శాతం హిందువులకే లబ్ధి..!

by  |
పథకాల్లో 85శాతం హిందువులకే లబ్ధి..!
X

దిశ, వెబ్‎డెస్క్: సీఎం జగన్‏‎పై టీడీపీ అధినేత చంద్రబాబు బురద చల్లేందుకు యత్నిస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. సోమవారం రోజా చారిటబుల్ ట్రస్ట్ నిధులతో స్విమ్స్ ఆస్పత్రికి రూ.2 లక్షలు విలువ చేసే 10 స్ట్రెచర్‎లను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ వెంగమాంబ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాల్లో 85 శాతం హిందువులే లబ్ధి పొందుతున్నారని తెలిపారు. జగన్‎కు కులాన్ని, మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. అంతర్వేది విషయంలో మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

Read Also…

డీజీపీ రిజైన్ చేయాలి.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు


Next Story

Most Viewed