ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 11 మందికి కరోనా

by vinod kumar |   ( Updated:2020-04-07 07:04:48.0  )

దిశ, మహబూబ్‌నగర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తాజాగా 8 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మంగళవారం ఉదయం తరువాత వచ్చిన పరీక్ష రిపోర్టుల ఆధారంగా అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్లో 3 కేసులు నమోదు కాగా గద్వాలలో 8 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మంగళవారం మహబూబ్‌నగర్ పట్టణంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా నమోదైన మూడు కేసులు కూడా మర్కజ్ నుండి వచ్చిన వారి ద్వారా ఇతరులకు సోకినవిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు కేసుల్లో 23 రోజుల పసికందు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో బికే రెడ్డి కాలనీ,మర్లు ప్రాంతాల నుంచి రాకపోకలను పరిమితం చేయటమే కాకుండా, వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనాలను పిచికారి చేయించినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాంతాలలోని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తిస్తున్నామని, అలా గుర్తించిన వారందరిని ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచుతున్నట్లు వెల్లడించారు.
గద్వాలలో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని 2, గద్వాల నియోజకవర్గ పరిధిలో 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి జోగులాంబ గద్వాల జిల్లాలో 18 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు అయినట్లు తెలుస్తోంది.

Tags: corona virus,Mahabubnagar,8 corona positive cases

Advertisement

Next Story