ఏపీలో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు

by  |
ఏపీలో కొత్తగా 7,738 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 7,738 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 57 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 6,25,514కు చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 5,359కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 78,836 కు చేరాయి. మహమ్మాని బారి నుంచి కోలుకొని 5,41,319 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 51,04,131 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.


Next Story