బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం

by  |
బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం
X

దిశ, వెబ్ డెస్క్: బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమైన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు బస్సులో ప్రమాదావశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కి ఐదుగురు సజీవదహనం అయ్యారు. బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.


Next Story

Most Viewed