అయ్యో… ఎద్దులు, కోడి పుంజులు మృతి

by  |
అయ్యో… ఎద్దులు, కోడి పుంజులు మృతి
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: విద్యుత్ షాక్ తగిలి నోరులేని 4 పశువులు మృత్యువాత పడ్డాయి. వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామనికి చెందిన రాయల్ చెరువు గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోవింద్ కు చెందిన 3 ఎద్దులు, ఒక ఆవు, మూడు కోడి పుంజులు విద్యుత్ ప్రమాదంతో మృతి చెందినట్లు తెలిపారు. గురువారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎద్దులు ఉన్న కొట్టంలో ఫ్యాన్ ద్వారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పశువులు మృతి చెందినట్లు రైతు తెలిపారు. మూగ జీవులు మృత్యువాత పడటంతో రైతుతో పాటు గ్రామస్థులు దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. రైతును ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు.



Next Story