రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు..!

by  |
రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు..!
X

దిశ వెబ్‎డెస్క్: నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రానికి పనిదినాలతో పాటు అదనంగా రూ.4వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్‎కు అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు. పది జిల్లాలో రూ. 10 కోట్లు ప్రతివారంలో మెటీరియల్ కాంపోనెంట్‎ను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్స్‌ను పూర్తి చేయడం, అంగన్‌ వాడీ కేంద్రాల నిర్మాణాలు, స్కూల్‌ కాంపొండ్‌ లను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.



Next Story