విషాదం.. 38కి చేరిన మృతుల సంఖ్య

by  |
విషాదం.. 38కి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ లో తీవ్ర విషాదం నెలకొన్నది. కల్తీ మద్యం తాగి 38 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో సీరయస్ అవుతూ విచారణకు ఆదేశించింది. దీంతో కల్తీ మద్యం అమ్ముతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు.

ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Next Story