ఓ బ్యాంకులో ఏకంగా 38 మందికి కరోనా

by  |
ఓ బ్యాంకులో ఏకంగా 38 మందికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో కరోనా రక్కసి కోరలు చాచుతోంది. ఓ జాతీయ బ్యాంకులో ఏకంగా 38 మంది కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన తిరుచురాపల్లిలో చోటుచేసుకుంది. దీంతో ఇటీవల బ్యాంకును సందర్శించిన ఖాతాదారులు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

కాగా, ఇటీవల ఆ బ్యాంకు బ్రాంచ్ సీనియర్ అధికారి ఒకరు కరోనా లక్షణాలతో మృతి చెందారు. తాజాగా, బ్యాంకులో ఏకంగా 38 మంది వైరస్ బారినపడటం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో బ్యాంకు మొత్తాన్ని శానిటైజ్ చేశారు. సోమవారం నుంచి తిరిగి బ్యాంకును ప్రారంభిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed