- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాల చేతిలో ఆదివారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని పంథా చౌక్ చెక్ పోస్ట్ వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కాగా, గత మూడు రోజుల్లో భద్రతా బలగాల చేతుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాది లొంగిపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story