శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతి

by  |
శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు చెన్నకేశవు, ఓబులేసు, భీమారెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed