కారులో 11 మంది.. అందులో ముగ్గురు మృతి

by  |
కారులో 11 మంది.. అందులో ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై కారులో ప్రయాణిస్తున్న 11 మందిలో ముగ్గురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గురజాలలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించినట్లు సమాచారం.


Next Story

Most Viewed