మూడు రాజధానులపై బీజేపీలో తలోమాట!

by  |
మూడు రాజధానులపై బీజేపీలో తలోమాట!
X

వెబ్‌డెస్క్: ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకరు మూడు రాజధానులుకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నా.. మరోనేత చూస్తూ ఊరుకోబోం అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీ తాజా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశామని పేర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ ఎమ్మెల్సీ, పారిశ్రామిక వేత్త సృజనా చౌదరి మాత్రం రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని, సీఎం తన ఇష్టానూసారం చేసుకుంటూ పోతే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చిరస్తున్నారు. దీంతో మూడు రాజధానుల విషయంలో బీజేపీ స్టేటజి అర్థంకాక ప్రజలు, ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారు.



Next Story