- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కీర్తిసాయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నారు. స్త్రీ వైద్య నిపుణులు డా. ప్రేమలత కథనం ప్రకారం.. మోర్తాడ్ మండలం, సుంకేట్ గ్రామానికి చెందిన హర్షిత ప్రసవం కోసం కీర్తి సాయి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చింది.
వైద్య నిపుణులు ప్రేమలత ఆధ్వర్యంలో గంటపాటు శస్త్రచికిత్స చేయగా, హర్షిత ఓకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు చిన్నారులు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారు. మొదట ఆడపిల్లకు జన్మనివ్వగా, ఆ శిశువు 1.8 కిలోల బరువు ఉంది.
రెండోసారి మగబిడ్డకు జన్మనివ్వగా 1.9 కిలోల బరువు ఉందని, మూడోసారి కూడా మగబిడ్డకు జన్మనివ్వగా, 2.0 కిలోల బరువు ఉన్నారని డాక్టర్ ప్రేమలత వెల్లడించారు. ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, ఈ ఆస్పత్రిలో ఇప్పటివరకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలతో, 5గురు తల్లులు జన్మనిచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.