ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

by  |
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
X

దిశ, జుక్కల్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పెర్గ గ్రామంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం..మహారాష్ట్రలోని నరంగల్ గ్రామానికి చెందిన 23 మంది కూలీలు పని నిమిత్తం తడిహిప్పెర్గ గ్రామానికి వచ్చారు. పనులు ముగించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా కొట్టింది. గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే ఇద్దరు మృతి చెందారు. మిగతా క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story