ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు మృతి

by  |
ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటన జిల్లాలోని నరసరావుపేట మండలం శాంతినగర్ వద్ద గురువారం వెలుగులోకివచ్చింది.

వివరాల్లోకివెళితే.. ఎదురెదురుగా వచ్చిన ఆటో, ద్విచక్రవాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు అక్కేనా కనకయ్య (45), శ్రీను (35) మాచవరం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందుకున్న నకరికల్లు మండల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also..

విశాఖలో తీరని విషాదం..


Next Story

Most Viewed