భారత్‌లో కరోనా రికార్డు..@24,850

by  |
భారత్‌లో కరోనా రికార్డు..@24,850
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. రోజురోజుకీ వైరస్ వ్యాప్తి క్రమేనా విజృంభిస్తూ.. బాధితుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటుంది. దీంతో దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 24,850 కేసులు నమోదు కాగా.. 613 మంది వైరస్ కారణంగా మరణించారు. తాజా కేసులతో భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. మరణాల సంఖ్య కూడా ఏ మాత్రం తీసుపోకుండా 19,268కి చేరింది. కాగా, ప్రస్తుతం 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. మరో 4,9,083 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారని బులెటిన్‌లో స్పష్టం చేసింది.


Next Story

Most Viewed