తెలంగాణలో కరోనా విజృంభణ

by  |
తెలంగాణలో కరోనా విజృంభణ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,381 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,81,627కు చేరాయి. మృతుల సంఖ్య 1,080 కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 30,387 ఉండగా, వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,50,160కు చేరింది. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధలో 386 కేసులు నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకూ 27,41,836 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.


Next Story