2300 మంది టీచర్లకు కరోనా..!

by  |
2300 మంది టీచర్లకు కరోనా..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇన్నిరోజులు కరోనా వారియర్లపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తాజాగా టీచర్లపై పంజా విసురుతోంది. తెలంగాణలో ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే 2300 ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.

గత కొద్ది రోజులుగా ప్రభుత్వ టీచర్లు కరోనా బారిన పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నాయి. దీంతో తాజాగా కరోనా సోకిన ఉపాధ్యాయుల వివరాలను ప్రభుత్వం సేకరించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీచర్లకు ఈనెల 20 వరకు వర్క్‌ఫ్రంహోం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also..

ఆ ఇళ్లల్లో ‘హోం ఐసోలేషన్’ హై రిస్క్..!



Next Story

Most Viewed