తెలంగాణలో కొత్తగా 2,207 పాజిటివ్ కేసులు

by  |
తెలంగాణలో కొత్తగా 2,207 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,207 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ మూలంగా 12 మంది మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కు చేరింది. మరణాల సంఖ్య 601కి చేరింది. రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,417 కాగా, వైరస్ బారిన పడి డిశ్చార్జి అయిన వారు 53,239గా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 532 కేసులు నమోదు అయ్యానట్టు రాష్ట్ర హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.



Next Story

Most Viewed