కరీనాను పెళ్లాడిన యువకుడు

by  |
కరీనాను పెళ్లాడిన యువకుడు
X

దిశ, వెబ్‌డెస్క్: కరీనా అనే హిజ్రాను ప్రేమించిన 21 ఏండ్ల యువకుడు పెండ్లి చేసుకున్నాడు. ప్రేమకు లింగ బేధంతో సంబంధం లేదంటూ తల్లిదండ్రులను ఎదిరించాడు.. దీంతో వీరిద్దరికి మిగతా హిజ్రాలు పెద్దరికం వహించి వివాహం జరిపించారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది.

విరుద్‌నగర్ జిల్లా వలయంకుళానికి చెందిన కరుప్పస్వామి (21) వృత్తిరీత్యా డ్రైవర్. అదే గ్రామానికి చెందిన కరుప్పస్వామి (24)(ఇద్దరిది ఒకే పేరు) అతడికి కలిగిన కొన్ని కోరికల కారణంగా హిజ్రాగా మారిపోయాడు. కరుప్పస్వామి హిజ్రాగా మారిన తర్వాత తన పేరును కరీనా అని మార్చుకున్నాడు. అయితే, కరీనా-కరుప్పస్వామి దగ్గరి బంధువులు కావడంతో నిత్యం కలుసుకునేవారు. దీంతో ఒకరి పై మరొకరు ప్రేమ పెంచుకున్నారు. ఆ తర్వాత లవర్స్ లాగే షికారులకు వెళ్లేవారు. ఇక చివరకు ఒకరిని వదిలి మరొకరు ఉండలేక పెండ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

దీంతో కరుప్పస్వామి తన తండ్రి అయిన కందస్వామికి జరిగిన విషయం చెప్పాడు. కరీనాను పెండ్లి చేసుకుంటానని పట్టుబట్టినా.. హిజ్రాను ఓ అబ్బాయి చేసుకోవడం ఏంటని తండ్రి నిలదీశాడు. ముమ్మాటికి పెండ్లికి ఒప్పుకోలేనని తేల్చి చెప్పాడు. దీంతో కరీనాను వదులుకోలేక పోయిన కరుప్పస్వామి ఇంట్లో నుంచి వచ్చేశాడు. దీంతో కరీనాకు స్నేహితులు అయిన సదరు హిజ్రాలు అబ్బాయికి ధైర్యం చెప్పి.. స్థానిక ఆలయంలో ఇద్దరి వివాహం జరిపించారు.


Next Story

Most Viewed