చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

by  |
చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం ముగ్గురు యువకులు కలిసి ఓ బైక్ పై వెళ్తున్నారు. ఉడుంపూర్ గ్రామ శివారులో రాగానే ఆ బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన పలువురు స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రకి తరలించారు.



Next Story