ఉదయం రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by  |
ఉదయం రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కనిగిరి మండలం మాచవరం దగ్గర శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మార్చురీకి తరలించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Next Story