- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆపదలో ఉన్న ఇద్దరిని రక్షించబోయిన అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొన్నది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోల్ లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో అంబులెన్సులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అంబులెన్స్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు జి. కమలాకర్ రెడ్డి(48), నందగోపాల్ రెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.