మిస్సింగ్ అయిన బాలుడు శవంగా..

by  |
మిస్సింగ్ అయిన బాలుడు శవంగా..
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం రావులపాడులో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారుల అదృశ్యం విషాదంగా మారింది. అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల్లో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. కొత్తపేట మండలం పలివెలాకుల వద్ద కాల్వలో బాలుడి మృతదేహం కొట్టుకొచ్చింది.

దీంతో చిన్నారుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరొక చిన్నారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రావులపాడులో వీరిద్దరూ ఆడుకుంటూ అదృశ్యమయ్యారు.


Next Story