వరదల ధాటికి 17మంది మృతి..

by  |
వరదల ధాటికి 17మంది మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: వరదలు సృష్టించిన బీభత్సం వలన ఒడిశాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు వరదల ధాటికి 17మంది మృతి చెందారు. అంతేకాకుండా వరదల కారణంగా 10,382 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది.

మొత్తం మీద 20 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వదరల్లో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించి వారి బాగోగులు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Next Story