తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..

by  |
తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో గురువారం ఒక్కరోజే 47కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 మందికి, రంగారెడ్డిలో ఐదుగురికి, ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నెల 9నాటికి 1,163 కేసులు ఉండగా.. ఈ ఐదు రోజుల్లో 251 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,414కు చేరుకుంది. మొత్తం 34 మంది మృతి చెందారు. ప్రస్తుతం 428 కేసులకు చికిత్స అందిస్తున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ వివరించింది. కరోనా పాజిటివ్ కేసుల్లో 952 మంది డిశ్చార్జి అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కేసులు నమోదు కాని జిల్లాలుగా వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి ఉన్నాయని ఆరోగ్యశాఖ పేర్కొనగా.. 29జిల్లాల్లో గత 14రోజుల్లో కరోనా కేసులు నమోదు కాలేదని బులిటెన్ పేర్కొంది.


Next Story

Most Viewed