పోలీసు అకాడమీలో ఒక్క రోజులోనే 124మందికి పాజిటివ్

by  |
పోలీసు అకాడమీలో ఒక్క రోజులోనే 124మందికి పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పోలీసు అకాడమీలో 124మందికి పైగా (అటెండర్ స్థాయి నుంచి డీఐజీ రేంజ్)వరకు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అకాడమీలో 1900మంది క్యాడెట్లు శిక్షణలో ఉండగా, వారందరికీ కూడా కరోనా టెస్టులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, శనివారం అదే అకాడమీలో 23 మందికి పైగా కరోనా పాజిటివ్ రాగా, ఆదివారం ఒకే రోజు వ్యవధిలో వందకు పైగా కేసులు నమోదు కావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.


Next Story

Most Viewed