- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఒకే కుటంబంలో 12 మందికి కరోనా
by Shyam |

X
దిశ, పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కరోనా విజృంభిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 12మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో వారందరికీ జ్వరాలు వచ్చాయి. కరోనా సోకిందనే అనుమానంతో శనివారం మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 12మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా రావడంతో స్థానికులంతా భయాందోళనలో ఉన్నారు.
Next Story