దోస్త్‌కు 1,12,870 రిజిస్ట్రేషన్లు

by  |
దోస్త్‌కు 1,12,870 రిజిస్ట్రేషన్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దోస్త్ ఫేజ్ -1లో భాగంగా ఈ నెల 6 తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు 1,12,870 మంది రిజిస్ర్టేషన్లు చేసుకున్నట్టు కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటివరకు 83,526 మంది వెబ్ ఆప్షన్లను పూర్తి చేయగా.. వీరిలో 82,204 మంది (98.5%) తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి 1,322 మంది ఇతర బోర్డుల నుంచి ఉన్నారు. ఈనెల 7తో ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు ముగుస్తుండగా.. 8తేదీ వరకూ వెబ్ ఆప్షన్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వెబ్ ఆప్షన్లను పూర్తి చేసిన విద్యార్థులను మరోసారి అప్లికేషన్లను పరిశీలించుకోవాలని కన్వీనర్ సూచించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్‌లైన్, వాట్సప్ (7901002200), ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వీడీయోలను అందుబాటులో ఉంచారు.


Next Story

Most Viewed