శ్రీశైలం దేవస్థానంలో 11 మంది సస్పెండ్

by  |
శ్రీశైలం దేవస్థానంలో 11 మంది సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం దేవస్థానంలో అవినీతి జరిగిందన్న అభియోగంపై కేసు నమోదు చేసుకున్న ఏసీబీ… దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే పలు సంచలన విషయాలు వెల్లడించింది.

2016 నుంచి మాన్యువల్ టికెట్స్, ఆన్లైన్ టికెట్స్ పై విచారణ జరుపుతోంది. కరోనా నేపథ్యంలో కొంత విచారణ ఆలస్యం అవుతున్నట్టు చెబుతోంది. కాగా ఈ కేసులో పర్యవేక్షణ లోపం కింద 11 మంది రెగ్యులర్ సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.

రూ.2.50 కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారించిన అధికారులు రూ.83 లక్షల రికవరీ చేసినట్టు తెలుస్తోంది. నిందితులపై 406, 420, 407, 65, 67, 120బి కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.


Next Story

Most Viewed