100క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత..

by  |
100క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత..
X

దిశ, వెబ్ డెస్క్ :

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పాత బస్టాండ్ సమీపంలోని 42వ రేషన్ దుకాణంలో బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తుండగా గమనించిన స్థానికులు వ్యాన్‌ను అడ్డుకున్నారు.

ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు చేరవేయంతో వెంటనే రంగంలోకి దిగిన వారు అక్రమంగా నిల్వచేస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన నిందితులపై కేసు నమోదు చేశారు.



Next Story

Most Viewed