కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ పార్టీ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 11 |
కన్ఫ్యూజన్ లో  కాంగ్రెస్ పార్టీ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీ కాన్ఫ్యూజన్ లో ఉందని, ప్రజలందరికి నరేంద్ర మోడీ పరిపాలన అంటే నమ్మకమని చేవెళ్ల పార్లమెంట్ బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ లోని మంఖాల్ ,రావిరాల, సర్దార్ నగర్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చిన్నపిల్లలు తినే గుడ్లను, కోళ్ల దానను స్కాం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి బిజెపి పార్టీ పేరు వింటేనే భయం పట్టిందన్నారు.

గ్రామాల్లో,మున్సిపాలిటీలలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని,నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలలో స్థానికులకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఓ వర్గం ఓట్ల కోసం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికేతురులకు ఇచ్చారన్నారు. ఎంపీగా గెలవగానే స్థానికులకే డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బిజేపి ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, తుక్కుగూడ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు రచ్చ లక్ష్మణ్,శివ కుమార్ గౌడ్, రాజమోని రాజు, జాపాల సుధాకర్, బాకీ విల్లాస్, బోధ యాదగిరి రెడ్డి, శివయ్య గౌడ్,పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed