- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎన్నికల తరువాత ప్రభుత్వం ఉండదని రేవంత్ రెడ్డి కి తెలుసు
దిశ, కోటగిరి : పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి కి తెలుసు కాబట్టే ఆగస్టు నెలలో రుణమాఫీ చేస్తామని తప్పుడు హామీలు ఇస్తున్నాడని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ మోస పూరిత మాటల నమ్మి ప్రజలు పట్టం కడితే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో
విఫలం అయిందని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలు తారుమారు అయ్యో అవకాశం ఉండదని, అందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోసమే ఆగస్టు నెలలో రుణ మాఫీ అనే మంత్రం జపిస్తున్నారని ఆయన అన్నారు. కావున బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి గడప గడపకు ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల అధ్యక్షులు ఏజాజ్ ఖాన్, జెడ్పీ ఆప్షన్ నెంబర్ సిరాజ్ ఉద్దీన్, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్ కూచి సిద్దులు, హమీద్, అనిల్ కులకర్ణి, శ్రీధర్, సాయిలు, గజేందర్, గంగ ప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.