- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పరమేశ్వరి వైన్స్ లో కల్తీమద్యం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం మాఫియా బరితెగించింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్, ఇన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాలు కలిగిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కల్తీ మద్యం విక్రయాలకు తెగబడుతున్నారు. గురువారం స్టేట్ ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో నిజామబాద్ నగరంలోని పరమేశ్వరి వైన్స్ ( నిఖిల్ సాయి ముందర) లో సోదాలు నిర్వహించారు. అక్కడ వైన్స్ లో కల్తీ మద్యం అనగా హయ్యర్ బ్రాండ్ లో చీప్ లిక్కర్ కలిపి విక్రయిస్తున్నారు
అనే సమాచారంతో దాడి చేసి (37) ఫుల్ బాటిల్స్ సీజ్ చేసి వైన్స్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. మద్యం షాపు నిర్వాహకుడితో పాటు కల్తీ మద్యం విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం సిండికేట్ వ్యవహారం వెనుక అధికారులు ఉన్నట్టు సమాచారం. మద్యం షాపుల లైసెన్సులు పొందినప్పుడు స్థానిక ఎక్సైజ్ అధికారులకు లక్ష చొప్పున ముట్ట చెప్పామని, ప్రతినెలా ఎక్సైజ్ సీఐలకు మామూళ్లు ఇస్తున్నామని బరితెగించి కల్తీ మద్యంతోపాటు ఇష్టం వచ్చిన ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నారు. స్థానిక ఎక్సైజ్ అధికారులకు మామూలు ముట్టడంతోనే కల్తీ మద్యం విషయం వెలుగులోకి రాలేదని సమాచారం.