పసుపు సాగులో ఆర్మూర్ రైతులది దేశంలోనే అగ్రస్థానం

by Disha Web Desk 15 |
పసుపు సాగులో ఆర్మూర్ రైతులది దేశంలోనే అగ్రస్థానం
X

దిశ, ఆర్మూర్ : పసుపు పంట సాగులో దేశంలో ఆర్మూర్ ప్రాంత రైతులదే అగ్ర స్థానమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం రాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం లోని మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. రైతులకు చెప్పిన మాట ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత పసుపు బోర్డు మంజూరు చేయించారని తెలిపారు.

హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకుంటిత దీక్షతో నిర్మాణం పూర్తి చేయించారన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి మరోసారి అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలందరూ బీజేపీ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పల్లె గంగారెడ్డి, జీవి నరసింహారెడ్డి, పాలెపు రాజు, కంచెట్టి గంగాధర్, యామాద్రి భాస్కర్, కలిగోట్ గంగాధర్, అందాపూర్ రాజు, ద్యాగ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed