రిజర్వేషన్ల రద్దు అబద్దపు ప్రచారం : బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్

by Disha Web Desk 15 |
రిజర్వేషన్ల రద్దు అబద్దపు ప్రచారం : బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్
X

దిశ,మోత్కూరు : మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు అని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చూస్తున్నాయని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను లక్ష మెజారీటీతో గెలుస్తున్నానని, బీఆర్ఎస్ లో తనపై ఉన్న సానుభూతిపరులంతా తనకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

తాను ఎంపీగా ఉన్న సమయంలో తొమ్మిది వేల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరు అశోక్ గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గ కన్వీనర్ కాప రవికుమార్, జిల్లానాయకులు కొనతం నాగార్జున రెడ్డి, దొంతి నరసింహారెడ్డి, గౌరు శ్రీనివాస్, కూరాకుల వెంకన్న, దీటి సందీప్, పోచం సోమయ్య, చేకూరి మల్లేష్, సజ్జన మనోహర్, ముత్తినేని తిరుమలేష్, గూడ మధుసూదన్, మరాటి అంజయ్య, చాడ మంజుల, ఏసబోయిన రమణ, సోమేశ్వరి, ఎడ్ల రాము, చంద్రమౌళి, శివ, మామిడాల యాకేష్, జిలకర దశరథ, నర్సింగ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed